| Daily భారత్
Logo




పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ జోరుగా హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు

News

Posted on 2025-12-31 20:33:56

Share: Share


పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ జోరుగా హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల నృత్యాలు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం తెలిపేందుకు కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు బుధవారం సాయంత్రం జోరుగా హుషారుగా ఆట పాటలతో అదరగొట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో గల కాకతీయ విద్యా సంస్థలో 2025 సంవత్సరం ముగింపు సందర్భంగా వీడ్కోలు పలుకుతూ ఉత్సాహంగా 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినిలు తమ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 2025 బై బై అంటూ 2026 సంవత్సరానికి వెల్కమ్ అని పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో  గడపాలని వారు అన్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని వారు అన్నారు. ఎందుకంటే విద్యార్థులే దేశానికి పునాది లాంటివారని 31 డిసెంబర్ అని ఈవెంట్ ల పేరిట ఎవరి పరిధిలో వారు ఉండాలని, ఈవెంట్లు చేసుకోవడం తప్పుకాదు కానీ వాటి పేరు పేరిట తప్పులో నడవద్దన్నారు. ముఖ్యంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులను వారు కోరారు.


Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >