Posted on 2025-12-31 18:44:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని స్థానిక మారుతి నగర్ లో బుధవారం స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో కీర్తిశేషులు మాధవి రెడ్డి జయంతి వేడుకలను ఆమె తల్లిదండ్రులు బివి రమణారెడ్డి, లక్ష్మీదేవి లు దివ్యాంగుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి రమణారెడ్డి మాట్లాడుతూ తమ కుమార్తె మాధవిరెడ్డి మరణించి 11 సంవత్సరాలు అవుతుందని, ఆమెకు చిన్నపిల్లలు అంటే అమృతమైన ఇష్టమని ఆమె లేని లోటును దివ్యాంగ బాలల్లో చూసుకుంటున్నామని అందుకే ఆమె పుట్టినరోజును ప్రతి సంవత్సరం దివ్యాంగుల మధ్య జరుపుకుంటున్నామని ఆమె పేరిట మాధవిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు మరియు పేద ప్రజలకు సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగ విద్యార్థుల సహాయార్థం 25వేల రూపాయల చెక్కును అందిస్తున్నామని అదేవిధంగా మానసిక దివ్యాంగులకు యోగ నేర్పించి వారిని ప్రయోజకులుగా మారుస్తున్న యోగ ఉపాధ్యాయురాలు వీణ కు వేల 2500 రూపాయలు చెక్కును అందించారు. అనంతరం దివ్యాంగులకు మిఠాయిలు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముబారక్ నగర్ కాలనీవాసులు శ్రీనివాస్ కవితలు పాల్గొన్నారు.
దివ్యాంగ విద్యార్థుల సహాయార్థం కోసం 25 వేల రూపాయల చెక్కు అందజేత
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పాఠశాలల సిబ్బంది, మానసిక దివ్యాంగులు, అంధ పాల్గొన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >