| Daily భారత్
Logo




దారుణం... ముగ్గురు పిల్లలకు విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య

News

Posted on 2026-01-01 14:12:48

Share: Share


దారుణం... ముగ్గురు పిల్లలకు విషమిచ్చి...  తండ్రి ఆత్మహత్య

డైలీ భారత్, నంద్యాల: ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను విషమిచ్చి.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఈ అనూహ్య ఘటనతో కుటుంబం పూర్తిగా ఛిద్రమవ్వడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తంగా క్షణికావేశంలో, మానసిక ఒత్తిడితో మనుషులు మృగం లాగా మారిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు అనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుంది.

జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నేలో కంటికి రెప్పలా బిడ్డలను కాపాడాల్సిన తండ్రి కాలయముడు లాగా మారాడు. వేములపాటి సురేంద్ర (34) మానసిక ఒత్తిడితో దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తానే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది.

ఈ దారుణ ఘటనలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను సిగిన్నారుకు కావ్య (7 సంవత్సరాలు), ధ్యానేశ్వరి (4 సంవత్సరాలు), సూర్య గగన్ (2 సంవత్సరాలు).. అత్యంత చిన్న వయసులోనే ముగ్గురు పిల్లలు మరణించడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. పిల్లల భవిష్యత్తు, కలలు ఇలా ఒక్కసారిగా చిద్రమవ్వడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా పిల్లల తల్లి సుమారు 8 నెలల క్రితమే అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకొని మరణించారు.

అప్పటి నుంచి సురేంద్ర ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. సరైన మానసిక సహాయం లేకపోవడం ఈ విషాదానికి దారి తీసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామని తెలిపారు.

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >