Posted on 2026-01-02 23:11:22
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అని కిషన్ నగర్ గ్రామ సర్పంచ్ నల్ల నర్సమ్మ నర్సింలు అన్నారు. శుక్రవారం ఫరూఖ్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ చీరల వారు పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటివి మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వారు అన్నారు. అర్హులైన వారందరికీ చీరలు పంపిణీ జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిషన్ నగర్ గ్రామ ఉప సర్పంచ్ ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్, వార్డ్ సభ్యులు జోగు లక్ష్మి,భూషణ్, మీదెల అరుణ, ఏడ్ల లింగం,తడాకల సాయి కుమార్, సుగున్నమ, వంగ సరిత, కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
#rangareddy
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >