Posted on 2026-01-03 18:00:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్. నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా ఎన్నికైన పంచారెడ్డి శ్రీకాంత్ కు షాలువా కప్పి సన్మానించారు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఏం ఏ సలీం. అయన మాట్లాడుతూ...నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు ఏర్పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005 అనేది పేద ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిది అన్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచ రెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్ కోశాధికారి రాజ్ కుమార్ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులను అందరినీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కాంతపు గంగాధర్, జిల్లా సలహాదారులు మొహమ్మద్, జిల్లా కార్యదర్శి వాసం శ్రీధర్,, జగిత్యాల కార్యదర్శి సామల గంగాధర్,తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యదర్శి మాజీ ఏజీపీ ఎన్ లతా రెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు సునీతా రావు, రషీదా శ్యామల, మహమ్మద్ జానీ భాయ్, జానీ వై శ్రీనివాస్, మెట్పల్లి ప్రతినిధులు లక్ష్మీనారాయణ భరత్ ప్రభుదాస్ ముసవీర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >