Posted on 2026-01-03 17:53:22
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే నేటితరం ఉపాధ్యాయులకు, మహిళలకు ఆదర్శ ప్రాయమని, ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదనరెడ్డి రెడ్డి పేర్కొన్నారు. శనివారం షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సావిత్రి బాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుండాల అశోక్,ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తాతో కలిసి ఆయన ముఖ్య అతిధులుగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం వల్లే నేడు మహిళలు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు. పురుషులకంటే దీటుగా పనిచేయగలుగుతున్నారు. నింగి నుంచి నేల వరకు ప్రతి విభాగంలోనూ సత్తా చాటుతున్నారు. మహిళల్లో అసమానతలను రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే విశేషంగా కృషి చేశారు అని అన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >