Posted on 2026-01-03 19:41:01
భారాస లీగల్ సెల్ కన్వీనర్ మధుసుదన్ రావు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ నది ప్రవాహలకు ఆనకట్టలు కట్టిందే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో పచ్చని పంటలు కలకలలాడుతున్నాయంటే కారణం భారాస అధినేత కేసీఆర్ కు జలవనరులపై ఉన్న అధ్యయమేనన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్న మాటలు నీటిమీద మూటలేనని ఆయన ఎత్తిపొడిచారు. తెలంగాణ నీటి వనరులపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టులపై మాట్లాడం అవగాహన రాహిత్యమేనని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో, ఉద్యమానికి ముందు ముందుచూపుతోనే నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలు వేసింది, నీటిని ఒడిసి పట్టి పంట పొలాలకు పారిచ్చింది కేసీఆర్ అని మధుసుదన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర నదిజలాలపై ఏమాత్రం సోయి లేనోళ్ళు పాలకులుగా ఉండటమే తెలంగాణ కు శాపంగా మారిందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ ను ఉగ్రముష్కరుడు కసబ్ తో పోల్చడం, ఉరితీయమనడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని ఆయన అన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >