Posted on 2026-01-03 23:04:57
గ్రామస్తులకు సూచనలు తెలియజేసిన కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలం కొత్త అంజనాపురం పరిధిలోని మేడిపల్లి గ్రామంలో డీఎస్పీ కొత్తగూడెం అబ్దుల్ రహమాన్ , ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ సూచనలుగ్రామ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని, మైనర్లకు డ్రైవింగ్ చేయొద్దని, మద్యం సేవించి వాహనాలు నడప రాదని, వాహనదారులందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రాలీలలో మరియు ట్రాక్టర్లలో రోజువారి కూలీలు ప్రయాణం చేయవద్దని, ట్రాక్టర్లకు ర్యాలీలకు స్టిక్కరింగ్ వేయించుకోవాలని, పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై రమాదేవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >