Posted on 2026-01-04 11:56:52
డైలీ భారత్, హుజూర్ నగర్:జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు సామాజిక తెలంగాణ సాధనకు లక్ష్యంగా మేధావులు, వివిధ వర్గాల ప్రజలతో చర్చలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశంగా జనం బాట ప్రారంభించారు అందులో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం నేడు హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో పర్యటించనున్నారని శనివారం జాగృతి రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ రావు తెలియచేశారు
మధ్యాహ్నం1.30 గంటలకు ఇందిరా చౌక్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారని ఆయన తెలిపారు అందులో భాగంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సందర్శిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారులు మేధావులు కుల సంఘాలు ప్రజా సంఘాలు కవులు కళాకారులు విద్యార్థులు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు రైతులు మహిళలు యువకులు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >