Posted on 2026-01-04 11:56:52
డైలీ భారత్, హుజూర్ నగర్:జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు సామాజిక తెలంగాణ సాధనకు లక్ష్యంగా మేధావులు, వివిధ వర్గాల ప్రజలతో చర్చలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశంగా జనం బాట ప్రారంభించారు అందులో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం నేడు హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో పర్యటించనున్నారని శనివారం జాగృతి రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ రావు తెలియచేశారు
మధ్యాహ్నం1.30 గంటలకు ఇందిరా చౌక్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారని ఆయన తెలిపారు అందులో భాగంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సందర్శిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారులు మేధావులు కుల సంఘాలు ప్రజా సంఘాలు కవులు కళాకారులు విద్యార్థులు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు రైతులు మహిళలు యువకులు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >