Posted on 2026-01-07 18:00:29
డైలీ భారత్, సిరిసిల్ల:స్వచ్ఛ సర్వేక్షన్ 2025 లో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టే దిశగా వివిధ వాణిజ్య వ్యాపార ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యాపారులపై జరిమానాలు విధించబడినవి.
ఈ సందర్భంగా వ్యాపార వర్గాలు, దుకాణదారులకు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను వివరించారు. పునరావృతంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిరిసిల్లను శుభ్రంగా నిలుపుకోవడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నివారించి, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వంటి పర్యావరణహిత పదార్థాలను వినియోగించాలని మున్సిపాలిటీ అధికారులు వ్యాపారులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#sircilla #rajanna sircilla
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >