Posted on 2026-03-30 22:09:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్కు చెందిన భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ను బీఆర్ఎస్ కొత్తగూడెం మజీ మండల అధ్యక్షులు ఎండీ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, స్మారక చిహ్నాన్ని అందజేశారు.
సీఐ నరేష్ కుమార్ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపుతున్న చొరవను ప్రశంసించారు.
ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మజీ మండల అధ్యక్షుడు ఎండి హుస్సేన్, నాయకులు నజీర్,శ్యామ్, ఖాదర్, సతీష్, మోహన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ ఆత్మీయ వాతావరణంలో సాగింది.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >