Posted on 2024-09-01 12:17:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.శుక్రవారం రాత్రి మొదలైన వాన యమజోరుగా కురుస్తుంది. మరో రెండు రోజులు పాటు వర్షాలు ఇలాగే పడుతాయంటూ వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ ఎలర్ట్ కూడా జారీ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో అత్యధికంగా 299.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోదాడలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. అయితే కొట్టుకుపోయిన ఓ కారులో డెడ్ బాడీ ఉన్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే కారులో ఉండగానే వ్యక్తి చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇక నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురు హనుమమ్మ(78), ఆమె రెండో కూతురు అంజిలమ్మ(38) మృతిచెందారు. భర్త చనిపోవడంతో అంజిలమ్మ తన తల్లి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలకు శనివారం రాత్రి ఇల్లు కూలిపోవడంతో తల్లీకూతురు మృతి చెందారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు.
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >