Posted on 2024-09-01 12:18:10
డైలీ భారత్, వరంగల్ జిల్లా: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జనాలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వరదల్లో చిక్కుకుంది. వరంగల్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న TS24Z 0018 నెంబరు గల ఆర్టీసీ బస్సు నెక్కొండ – వెంకటాపురం చెరువు కట్ట పైన నిన్న రాత్రి 9గంటల ప్రాంతంలో వరద ప్రభావంతో చిక్కుకుపోయింది. వెంకటాపురం వద్ద తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో వీరు చిక్కుకుపోయారు. ఈ బస్సులో దాదాపుగా 45 మంది ప్రయాణికులున్నారు. రాత్రి నుండి ముందుకు వెనకకు పోలేక ప్రాణాపాయ పరిస్థితిలో సహాయం కోసం ఎదురు చూశారు ప్రయాణికులు. తమకు తాగడానికి మంచినీళ్లు కూడా లేవని బస్సులో చిన్న పిల్లలు ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను రక్షించాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గ్రామానికి చేరుకుని… ట్రాక్టర్ సహాయంతో ప్రయాణికులను రక్షించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. వర్షం తగ్గిన తర్వాత వారి గమ్యస్థానాలకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక మరో ఘటనలో విజయవాడ నుంచి మధిర వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మీనవోలు వద్ద వరదలో చిక్కుకుంది. స్థానికులు తాడు సాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులను అవతల ఒడ్డుకు చేర్చారు.
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >