Posted on 2024-10-25 07:49:17
ముదిరాజులకు పెద్దపీట వేస్తనంట్టివి కదా రేవంత్ రెడ్డి!
గత ప్రభుత్వం పుష్కలంగా చెరువులకు సరిపడ చేపపిల్లలు ఇస్తే రేవంత్ రెడ్డి మమ అంటుండు!
గౌరవేని సుమన్ ముదిరాజ్
బిఆర్ఎస్ నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల.
చేపపిల్లల పంపిణీలో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం!
ముదిరాజులకు పెద్దపీట వేస్తనంట్టివి కదా రేవంత్ రెడ్డి!
గత ప్రభుత్వం పుష్కలంగా చెరువులకు సరిపడ చేపపిల్లలు ఇస్తే రేవంత్ రెడ్డి మమ అంటుండు!
చేపపిల్లల సంఖ్య సగానికి తగ్గిస్తే ఎలా..
గతేడాది ఇచ్చిన దానిలో 50 శాతమే ఇవ్వడం సబబు కాదు
ఇది ముదిరాజ్ సామాజిక వర్గానికి నష్టం కలిగిస్తుంది
దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బ తింటుంది
ముఖ్యమంత్రికి సూటి ప్రశ్నవేసిన ముదిరాజ్, యువకులు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఏడాది చెరువులు, కుంటల్లో వేయడానికి గత ఏడాది ఇచ్చిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే ఇస్తామని ప్రభుత్వం నిబంధన విధించి, ఆ ప్రకారంగానే చేప పిల్లలను సరఫరా చేయడం సమంజసం కాదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు గౌరవెని సుమన్ & ముదిరాజ్ యువకులు పేర్కొన్నారు.
ఈ విధంగా చేయడం వల్ల చేపల ద్వారా ఉపాధి పొందే ముదిరాజ్ సామాజికవర్గానికి నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలని వారన్నారు.
ఈ విషయంగా శుక్రవారం వారి గ్రామం బొటిమీది పల్లె లో వారు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
గత ఏడాది చెరువులకు సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే ఈ ఏడాది సరఫరా చేస్తున్నారనే విషయం చాల వేదన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది చెరువులు, కుంటల్లో చేప పిల్లలను విడుదల చేసే విషయంగా రాష్ట్ర ఫిషరీస్ డైరెక్టర్ Memo No.CF-C/2/1/2024 DDIND, తేదీ 15.08.2024 జారీ చేసారని తెలిపారు. ఈ మెమో ప్రకారంగా రాష్ట్రంలో గత ఏడాది సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్యలో ఈ ఏడాది 50 శాతం మాత్రమే సరఫరా చేయాలని ఆంక్షలు విధించారని చెప్పారు. దీని వల్ల గత ఏడాది లక్ష చేప పిల్లలు సరఫరా చేసిన చెరువులకు ఈ ఏడాది 50 వేల చేప పిల్లలను మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తున్న ఈ ఏడాది వర్షాలు సరిగా కురవలేదంటూ ఫిషరీస్ డైరెక్టర్ తన మెమోలో సాకుగా చూపించి చేప పిల్లల సంఖ్యను సగానికి తగ్గించేయడం సమంజసం కాదని విమర్శించారు.
దీని వల్ల ఈ ఏడాది చెరువుల్లో చేపల సంఖ్య సగానికి తగ్గి పోతుందని, ఈ చేపల వేటపై ఆధారపడి జీవించే ముదిరాజ్ కుటుంబాల ఆదాయం కూడా సగానికి తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.
ఈ విధంగా చేప పిల్లల సంఖ్యను సగానికి తగ్గించేసి, ముదిరాజ్ కుటుంబాల ఆదాయాన్ని తగ్గించడం ముదిరాజుల భవిషత్తు దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేసారు.
అందుకే ఈ విషయంగా ముఖ్యమంత్రి కల్పించుకొని చెరువులు, కుంటలకు గత ఏడాది ఏ స్థాయిలో చేప పిల్లలను ఇచ్చారో, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా చేప పిల్లలను సరఫరా చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సుమన్ ముదిరాజ్,& యువకులు కోరారు.
తక్షణమే ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి పునరాలోచన చేసి గత ప్రభుత్వం మాదిరిగా చేపపిల్లల పంపిణీ చేపట్టకుంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 15:47:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 15:46:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 15:20:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 15:11:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 15:09:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >