Posted on 2025-06-09 11:26:57
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శంకర్ విజ్ఞప్తి
మీ డబ్బులు మీ వద్దే .. మీ పిల్లల భవిష్యత్తు మాదే లింగారెడ్డిగూడెం ఘనంగా బడిబాట కార్యక్రమం ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఏడుగురు విద్యార్థులు
డైలీ భారత్, రంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని, ప్రైవేట్ పాఠశాలలు వద్దని ప్రైవేటులో ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దని ప్రైవేట్ వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్
ప్రజలకు పిలుపునిచ్చారు.
ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామ బడిబాట కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు ఎమ్మెల్యే సమక్షంలో ప్రభుత్వ పాఠశాలలో చేరారు. మండల విద్యాశాఖ అధికారి మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తదితరులు హాజరయ్యారు.
బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యా యులతో కలిసి పాల్గొన్న ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యా యులచే విద్యాబోధన ఉంటుందని, విశాలమైన తరగతి గదులు ఉంటాయని, ఆడుకోవడానికి మైదానాలు, తెలుగు, ఆంగ్లంలోనూ విద్యాబోధన ఉంటుందన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదామన్నారు. ప్రైవేట్ లో పిల్లలను అప్పులు సప్పులు చేసి చదివించొద్దని ఆర్థికంగా నష్టపోతారని ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ద్వారా మీ డబ్బులు మీ వద్ద ఉంటాయని పిల్లల భవిష్యత్తు మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని అన్నారు.
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >