Posted on 2025-07-20 21:14:01
సిర్నాపల్లి గడి నుండి పెద్దపోచమ్మ ఆలయం వరకు పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపులో పాల్గొన్న మహిళామణులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా నగరంలోని గాండ్ల సంఘం అన్ని తర్పలకు కు చెందిన కుల సభ్యులు భారీ ఎత్తున బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. సిర్నాపల్లి గడి సమీపంలో ఉన్న పట్టణ పద్మశాలి సంఘం నుండి పోచమ్మ గల్లి లోని పెద్ద పోచమ్మ ఆలయం వరకు భారీ సంఖ్యలో మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం అందించారు. కార్యక్రమానికి నూడా చైర్మన్ కేసా వేణు ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ సాంప్రదాయ పండగ అయిన బోనాల పండుగను నేటి తరం యువతకు రాబోయే తరాలకు గుర్తుంది పోయేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని ఇంత పెద్ద ఎత్తున గాండ్ల సంఘంలోని పట్టణ అన్ని తర్పలకు చెందిన మహిళలు ఒకచోట చేరి అక్కడి నుండి పెద్దమ్మ పోచమ్మ వరకు బోనాలను ఎత్తుకొని అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా తీసుకెళ్లడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గాండ్ల సంఘానికి చెందిన కరుప గోపి తన కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో గాండ్ల సంఘం నుండి పెద్ద పోచమ్మ ఆలయం వరకు చేరుకున్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >