Posted on 2025-09-01 19:10:07
కాలేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ద్వారా విచారణ చేపట్టడం హర్షనీయం
నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలతోనే ప్రాజెక్టులు, చెరువులు తెగిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండంలంలోని ముత్యాల చెరువు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన వాడి, నడిమితండా గ్రామాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని ఎంపీ ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అలసత్వం వహించిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విచారణను సీబీఐకి అప్పగించడం హర్షణీయం అని పేర్కొన్నారు. ముత్యాల చెరువు తెగిపోయి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేశ్, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, జిర్ర మహిపాల్ యాదవ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >