Posted on 2025-09-26 15:43:01
వరంగల్/నెక్కొండ, డైలీ భారత్ న్యూస్:వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నెక్కొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 137వ జయంతి వేడుక సందర్బంగా రజక సంఘం ఏర్పాటు చేసుకున్న చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూమికోసం భుక్తి కోసం దోపిడీ నుండి విముక్తి కోసం,చాకలి ఐలమ్మ చేసిన పోరాటం మరవలేనిదన్నరు,దొరల దోపిడీ నుండి రజాకారుల వికృత చేష్టల నుండి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం రాబోయే తరానికి ఆదర్శంగా ఉందన్నారు.ఈ కార్యక్రమం లో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి,నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డాక్టర్ పులి అనిల్, మండల అధ్యక్షులు బక్కి అశోక్,,రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >