| Daily భారత్
Logo




రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై సామూహిక అత్యాచారం

News

Posted on 2025-09-30 19:34:23

Share: Share


రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై సామూహిక అత్యాచారం

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలానికి చెందిన వివాహిత(25) కు నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ కు చెందిన మోయిన్ ఇటీవల పరిచయమయ్యాడు. మోయిన్ సెంట్రింగ్ పనిచేసే క్రమంలో బిల్డింగ్ ఎదురుగ గల ఇంటికి చెందిన వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెను, కుమారుడితో పాటు మాయమాటాలు చెప్పి నిజామాబాద్ రూరల్ మండలంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ నెల 11న రాత్రి వివాహితకు, ఆమె కుమారుడికి తినే వాటిలో మత్తు పదార్థం ఇచ్చి సృహకోల్పోయేలా చేశాడు. అక్కడ మోయిన్ తో పాటు ఖయ్యూం, ఆమేర్ లు వివాహితపై అత్యాచారం చేశారు. గత కొన్ని రోజులుగా వివాహితపై ముగ్గురు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నెల 26న చివరి సారిగా ముప్కాల్ మండలంలోని ఓ ఇంటివద్ద వివాహితపై మోయిన్ అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి ఈ నెల 27న నాగారం తీసుకువెళ్లి ముల్ సాబ్ ను కలిసి వస్తాను అని చెప్పి అక్కడ వదిలి పరారి అయ్యాడు. బాధితురాలు తనపై జరిగిన ఆఘాయిత్యంపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి మోయిన్, ఖయ్యుం, అమేర్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపారు.

Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >