Posted on 2025-12-29 19:07:35
డైలీ భారత్, చింతలపాలెం:కర్ల రాజేష్ మృతికి కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారంతో చింతలపాలెం మండల కేంద్రంలో ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చింతిరాల బాల చంద్రుడు మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతికి ప్రధాన కారకుడైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి సస్పెన్షన్ అధికారికంగా ప్రకటించేంత వరకు ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు. ఈ దీక్షకు ఎమ్మార్పిఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >