Posted on 2026-01-01 23:09:04
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ – విజయవాడ హైవే పై టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పండుగ ముందు 9వ తేదీ నుంచి పండుగ పూర్తయిన తర్వాత 18వ తేదీ వరకూ టోల్ చార్జీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. ఆ తేదీల్లో టోల్ చార్జీల భారాన్ని రాష్ట్ర ఆర్ఆండ్ బీ శాఖ కేంద్రానికి చెల్లిస్తుందని చెబుతూ ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్ – విజయవాడ హైవే పై జనవరి 8 నుండి వాహన రద్దీ ఎక్కువ ఉంటుందని, సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు అని కోమటిరెడ్డి అధికారులకు వివరించారు. పోయినసారి ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుందని.. దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు తాను తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తానని చెప్పారు. ప్రధానంగా ఎల్బీనగర్ నుండి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో వేల వాహనాల రాకపోకలతో రద్దీ ఏర్పడుతుందని, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు అని అధికారులకు స్పష్టం చేశారు.పండుగ రద్ధీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
పండుగ సందర్భంగా జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ సమస్యల నివారణకు ఆ రోజుల్లో హెవీ వెహికల్స్కు అనుమతి నిరాకరించాలని నిర్ణయించామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుని.. గుంతలను ఈ రోజు రాత్రి నుంచే పూడ్చే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి 20కిలోమీటర్లకు అంబులెన్స్లను సిద్దంగా ఉంచుతామనితెలిపారు. రోడ్దు భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం పండుగ సందర్భంగా 2వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. ఇందుకోసం డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడినట్టు తెలిపారు. విజయవాడ –హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలోని చిట్యాల , చౌటుప్పల్ సహా ఎక్కడా కూడా రోడ్ల వెంట వాహనాలు నిలుపరాదని.. నిలిపిన వాహనాలను సీజ్ చేస్తారని తెలిపారు. అలాగే ఎక్కడైనా వాహనాల సమస్యలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే వాటిని తొలగించేందుకు భారీ క్రేన్లు అందుబాటులో పెడుతున్నామని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్బంగా రహదారి విధుల్లో ఉండే ఆర్ ఆండ్ బీ, రోడ్డు ట్రాన్స్ పోర్టు శాఖల ఉన్నతాధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు.
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >