Posted on 2026-01-05 20:44:44
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం...కారు ఢీకొని హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా పోలీస్ కార్యాలయ సమీపంలోని క్రషర్ వద్ద వేగంగా వచ్చిన కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి కారు ఢీకొట్టడం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టగా, బైక్పై ప్రయాణిస్తున్న హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, పట్టణ సిఐ కృష్ణలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ, స్వయంగా పోలీస్ వాహనంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉంటూ తోటి సిబ్బందిని కోల్పోవడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >