Posted on 2026-01-05 20:44:44
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం...కారు ఢీకొని హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా పోలీస్ కార్యాలయ సమీపంలోని క్రషర్ వద్ద వేగంగా వచ్చిన కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి కారు ఢీకొట్టడం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టగా, బైక్పై ప్రయాణిస్తున్న హోంగార్డు దేవయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, పట్టణ సిఐ కృష్ణలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ, స్వయంగా పోలీస్ వాహనంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉంటూ తోటి సిబ్బందిని కోల్పోవడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >