| Daily భారత్
Logo




తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు

News

Posted on 2026-03-09 13:56:02

Share: Share


తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్ దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దర్యాప్తులో భాగంగా ఎస్సార్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా డ్రగ్స్ తయారీలో ఉపయోగించే నిషేధిత రసాయనాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మెఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 2 బ్రోమో-4 మెథైల్ ప్రోపియోఫీనోన్ అనే రసాయనంతో పాటు, క్లోఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 3 క్లోరో-1 ఫెనైల్-1 ప్రోపనోన్ అనే కెమికల్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ వ్యవహారంలో ఎస్సార్ ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. ఇండియా మార్ట్ ద్వారా రాజస్థాన్‌కు చెందిన నిందితులకు ఈ రసాయనాలను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్ మూడు విడతల్లో దాదాపు 300 కిలోల రసాయనాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. నిందితులు తప్పుడు కంపెనీ పేర్లతో కెమికల్స్ కొనుగోలు చేసి షాద్‌నగర్‌లో అద్దె గదిని తీసుకుని అక్కడే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తయారు చేసిన డ్రగ్స్‌ను తిరిగి రాజస్థాన్‌కు తరలించి విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ గ్యాంగ్‌కు రాజస్థాన్‌కు చెందిన గిరీష్ థాపర్ అలియాస్ వీరేంద్ర స్వామి నాయకత్వం వహిస్తున్నాడు. నకిలీ పేర్లతో వ్యవహరిస్తూ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి సరుకును సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌లో మనీష్ బిష్ణోయి, మనోజ్ మాథూర్, శిశుపాల్, సుమీత్, రాజు కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. ఈ కెమికల్స్ సరఫరాకు సంబంధించి లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.ఈగిల్ పోలీసుల సమాచారంతో రాజస్థాన్ పోలీసులు వీరేంద్ర స్వామి, మనీష్ బిష్ణోయిని అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో షాద్‌నగర్‌లో నడుస్తున్న డ్రగ్ ల్యాబ్ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై NDPS చట్టంలోని సెక్షన్లు 21(C), 27A, 29, 30 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు..

Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >