Posted on 2026-03-09 19:09:41
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడుతూ మెడిపపన్న ఆదేశాల మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయం ర్యాలీ నిర్వహించడం జరిగిందని, తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దళితులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయాసం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం తక్షణమే అందించాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల సాగుభూమి కేటాయించాలని జీవో నెంబర్ 58.59 ప్రకారం అసైన్మెంట్ భూములను పట్టచేసి అమ్ముకొనుటకు హక్కు కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు కొరకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని, దానితోపాటు ఇసుక, సిమెంట్ ఎస్సీలకు ఉచితంగా ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ప్రకారం ఎస్సీలకు కూడా పోడు భూములను వర్తింపజేయాలని, విద్యకు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థలలో 25 శాతం ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ శాఖకు 15వేల కోట నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, పరిశుద్ధ కార్మికులకు నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి 20 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, తోళ్ల పరిశ్రమకు 10 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి, లీడ్ క్యాప్ భూములను పరిరక్షించుటకు, చైర్మన్ నియమించి తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >