Posted on 2026-03-26 18:01:44
డైలీ భారత్, మామడ: చీటింగ్ కేసు విషయంలో రూ. 40,000 లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ లో గురువారం చోటుచేసుకుంది. అదిలాబాద్ ఏసీబీ డి.ఎస్.పి జి మధు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మామడ ఎస్సెగా విధులు నిర్వహిస్తున్న అశోక్ ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. అనంతరం భేరసారాలు తర్వాత రూ.20,000 ఒప్పందం కుదుర్చుకున్నాడని, దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పన్నిన పథకం ప్రకారం సదరు బాధితుడు లంచం ఇస్తుండగా ఎస్సెని పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి కరీంనగర్ కోర్టుకు తరలించారు. ఈ ఎస్ఐ పై అనేక అవినీతి ఆరోపణాలు ఉన్నాయని ఉన్నతాధికారులు ఆయనను కఠినంగా శిక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >