Posted on 2025-09-19 17:46:13
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:సమాజంలో అన్ని దానాలకన్నా విద్యా దానం అత్యున్నతమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం (బి) శివారులో, శుక్రవారం నిజామాబాద్ జిల్లా ట్రస్మా (ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం సందర్భంగా జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత సమాజంలో గురువులను పూజిస్తారని,
భావి భారత పౌరులను తీర్చిదిద్దే నిర్మాతలు ఉపాధ్యాయులేనని, భూదానం, గో దానం, అన్నదానం చేసినా, అన్నిటికన్నా గొప్పది విద్యాదానం అని పేర్కొన్నారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాశాఖకు 22 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించిందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు వందల సంఖ్యలో చదువుతున్నారని, తల్లిదండ్రులు ఎంతో ఆశతో పంపిస్తున్నారని, మార్కులు – ర్యాంకులు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వ వికాసం కలిగేలా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. తరగతి గదుల్లో ప్రతిభావంతులతో పాటు బుద్ధి మాంద్యం కలిగిన విద్యార్థులు కూడా ఉంటారని, వారిని సమూహ చర్చల ద్వారా ప్రోత్సహించి తెలివితేటలు పెంచేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్, రజినీకాంత్, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >