| Daily భారత్
Logo




కాంగ్రెస్ నాయకులను దూషించే అర్హత కేటీఆర్ కు లేదు

News

Posted on 2026-01-05 16:49:50

Share: Share


కాంగ్రెస్ నాయకులను దూషించే అర్హత కేటీఆర్ కు లేదు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం హామలుచేస్తుంది

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సోమవారం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్  పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిన రాహుల్ గాంధీని,ముఖ్యమంత్రిని అవమానించే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ని కేటిఆర్ అవమానించడం అంటే ఆది కేటీఆర్ అవివేకానికి,అహంకారానికి నిదర్శనం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదు అని కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని,గతంలో బీఆర్ఎస్  అధికారంలో రాకముందు దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, ప్రతి పేదవానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చలేదు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీని నెరవేరుస్తుంది అని అన్నారు. కేటీఆర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి  పైన అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయి లేదు అని, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు . ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కేవలం ఫామ్ హౌస్ లోనే ఉంటూ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరైనది కాదు అని, ప్రజలలో ఉంటేనే ప్రభుత్వం పని చేస్తుందో చేయట్లేదో తెలుస్తుంది అని, ఇటీవల కెసిఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్లి మరి కరచాలనం చేసి మాట్లాడడం జరిగిందని ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి నిదర్శనమని, కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిలబడని కేటీఆర్ ఎలాంటి సాంస్కృతి అలవాటు చేసుకున్నాడు ప్రజలందరూ గమనించారని కేటీఆర్ కేవలం అహంకార ధోరణితో మాత్రమే ఆలోచిస్తున్నాడని అన్నారు. మరొకసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వాక్యాలు చేస్తే టిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్, సేవదల అధ్యక్షులు సంతోష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేష్  తదితరులు పాల్గొన్నారు.

Image 1

నిత్య అన్న ప్రసాదం సత్రానికి రూ.50,000 విరాళం అందజేత

Posted On 2026-04-21 06:59:51

Readmore >
Image 1

నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్

Posted On 2026-04-20 18:40:20

Readmore >
Image 1

గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు

Posted On 2026-04-20 18:18:28

Readmore >
Image 1

టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయండి

Posted On 2026-04-20 16:51:57

Readmore >
Image 1

వేములవాడలో సినీనటి పూనమ్ కౌర్ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-20 15:42:35

Readmore >
Image 1

ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-20 15:16:27

Readmore >
Image 1

చర్ల మండలంలో వరి కోత మిషన్ దహనం

Posted On 2026-04-20 14:59:28

Readmore >
Image 1

మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహణ

Posted On 2026-04-20 14:58:10

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

Posted On 2026-04-20 13:57:43

Readmore >
Image 1

బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు

Posted On 2026-04-20 13:41:10

Readmore >