Posted on 2025-09-30 13:00:54
ఉత్తమ సిబ్బంది 5 మందికి 5000 చొప్పున అందజేసిన ఎమ్మెల్యే
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పట్టణ పురవీధుల్లో నిరంతరం శ్రమించే మున్సిపల్ సిబ్బందికి ఒక మాట ఇచ్చారు నాయకుడు వీర్లపల్లి శంకర్. వారి కష్టానికి కన్నీళ్ళకు తోడుగా దసరా పండుగ సందర్భంగా ఓ కానుకను ఇస్తానని మూడు నెలల కింద షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వారికి హామీని ఇచ్చారు. ఆ పదం ఒక భరోసాగా... ఆ హామీ ఒక ఆశగా... కార్మిక మనసుల్లో ఒక కోరికగా నిలిచింది... నేడు వారందరి కోరికను తీరుస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 140 మంది మున్సిపల్ సిబ్బందికి 2000 చొప్పున దసరా కానుకను అందజేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సునీత రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి కనుకలను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై సిబ్బందికి దసరా కానుకను అందజేశారు. అదేవిధంగా తమ డిపార్టుమెంటులో ఉత్తమ సిబ్బంది 6 6 మందికి 5000 చొప్పున ప్రోత్సాహకాని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మున్సిపల్ సుందరీకరణకు నిరంతరం కృషి చేస్తున్న సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, అమ్మ కంటే గొప్పోళ్ళుగా నిలుస్తారని అన్నారు. అలాంటి కార్మికులకు తన వంతుగా సహాయం అందజేయాలనే ఉద్దేశంతోనే 140 మంది మున్సిపల్ సిబ్బందికి 2000 చొప్పున దసరా కానుక అందజేయాలని అనుకున్నానని, ఆ మేరకే నేడు వారికి అందజేయడం జరిగిందన్నారు. సిబ్బందికి దసరా కనుక అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సిబ్బంది ఎమ్మెల్యే శంకరన్న మంచి మనసున్న నాయకుడని, ఇలాంటి నాయకుడు ఉండడం తమ అదృష్టమని వారు కొనియాడారు. దసరా పండుగ సందర్భంగా మా అందరికీ కానకలు అందజేసినా ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం, సీనియర్ నేతలు కృష్ణారెడ్డి, అగ్గనూరు బస్వం, ఇబ్రహీం,మొహమ్మద్ ఇషాక్, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >