Posted on 2025-12-23 19:29:32
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు బిఎస్ రామయ్య నగర్ గ్రామస్తులతో మాట్లాడి వారికి జరుగుతున్న అన్యాయాన్ని గమనించి కాంట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తుల తో గుండగిరి చేస్తూ సొసైటీ సభ్యుల అనుమతి లేకుండా కొంతమంది సభ్యులతో కుమ్మక్కై ఇసుకను డంపింగ్ చేస్తూ ఆగడాలు సృష్టిస్తున్నాడని,అదేవిధంగా మహా గ్రామసభ తీర్మానం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కొందరు సభ్యులు కాంట్రాక్టర్ కి కొమ్ము కాస్తూ సొసైటీలో ఉన్న 49 మంది సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా ఇసుక డంపు చేసి ఆదివాసీ మహిళల ఉపాధిని దెబ్బతీస్తున్న కాంట్రాక్టర్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని, మహా గ్రామసభ తీర్మానం తర్వాత పాలకవర్గo ఏర్పడిన తర్వాత ఇసుక క్వారీ ప్రారంభించాలని, ప్రస్తుతం కాంట్రాక్టర్ గా ఉన్న అగ్రిమెంట్ ను రద్దు చేయాలని.అలాగే డి సి ఓ ఆఫీస్ లో పెట్టిన దరఖాస్తును పరిశీలించిన తర్వాతే బిఎస్ రామయ్య నగర్ ఇసుక క్వారీ ప్రారంభించాలని, చర్ల ఆదివాసి జేఏసీ చర్ల తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయం పై ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలని,ఆదివాసీ సేన రాష్ట్ర కో కన్వీనర్ యలకం. రామకృష్ణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఇర్ప. ప్రకాష్ చర్ల మండల మాజీ ఎంపీపీ గోంది. ముయన్న మాజీ సర్పంచ్ కారం. కన్నారావు ఆదివాసీ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ సోడి. సురేష్ పాల్గొన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >