| Daily భారత్
Logo




కొమురం భీం ఆదివాసి మహిళ ఇసుక సొసైటీనీ తక్షణమే నిలుపుదల చేయాలి. పాయం డిమాండ్

News

Posted on 2025-12-23 19:30:53

Share: Share


కొమురం భీం ఆదివాసి మహిళ ఇసుక సొసైటీనీ తక్షణమే నిలుపుదల చేయాలి. పాయం డిమాండ్

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TG mdc po కార్యాలయంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది

అనంతరం పాయం విషయం తెలియజేస్తూ చర్ల మండలం సుబ్బంపేట పంచాయితీ బిఎ స్ రామయ్య నగర్ శ్రీ కొమరం భీమ్ ఆదివాసి మహిళ ఇసుక సొసైటీలో అధ్యక్షురాలు యొక్క భర్త కను సన్నల్లో ఇప్పటివరకు నలుగురు రేజిం గ్ కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు రాసిస్తూ లక్ష రూపాయలు దండుకున్నారని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చెట్టును చూపించి కాయలు అమ్ముకునే వారి లెక్క తేలాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

గిరిజన సొసైటీలో బినామీ కాంట్రాక్టర్ల జోక్యం తగదని ప్రశ్నించారు. మండలంలో ఉన్నటువంటి ఇసుక సొసైటీల అధ్యక్ష కార్యదర్శుల నిర్ణయమే తుది నిర్ణయంగా కాంట్రాక్టర్లు అటు అధికారులు ఇటు బినామీ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తూ గిరిజన ఇసుక సొసైటీలకు ఉపాధిని నమ్ముకున్న సభ్యులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. 

ఏజెన్సీ చట్టం ఉంది పిసా చట్టం ఉంది ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి కానీ అమాయక ఆదివాసులకు ఉపాధిఫలితాలు దక్కడం లేదని అందని ద్రాక్షగా మిగిలిన ఇసుక సొసైటీ సభ్యులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కానీ బినామీ కాంట్రాక్టర్లు మాత్రం కోట్లల్లో సంపాదన చర్ల మండలంలో రహదారులన్నీ ఇసుక లారీలతో విద్యాసం అయ్యాయి కనుమరుగైపోయిన రహదారులు పంట పొలాలు పచ్చదనం ఇసుక లారీలతో నిత్యం చర్ల మండలంలో జాతీయ రహదారులు నిండి ఉండి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్న పట్టించుకోని అధికారులు సొసైటీలకు విలువలు ఉండవు రహదారుల పర్యావరణ రక్షణ శాఖ నిద్రపోతున్నది అని వాపోయారు. ప్రస్తుతం కొమరం భీం ఇసుక సొసైటీలో ఆదివాసుల మధ్యనే గొడవలు జరగటానికి మూల కారణం గిరిజనేతరుల కాంట్రాక్టర్లే. ముఖ్యంగా ఐటీడీఏ పీవో తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పర్యవేక్షణకే పరిమితం కాకుండా నిజ నిర్ధారణ ద్వారా విచారణ చేపట్టాలని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >