Posted on 2026-03-09 20:20:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో వివిధ క్రీడలు, రక్షణ, పలు రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కీర్తిస్తూ చంద్రంపేటకు చెందిన వెల్ది రేఖ మూడు నెలల పాటు శ్రమించి రూపొందించిన నారీశక్తి చీరను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆద్వర్యంలో వనిత చేయూత.. మహిళా సాధికారత కింద ముస్తాబాద్ మండలానికి చెందిన మహిళలకు కుట్టు శిక్షణ అందించి.. వారికి సర్టిఫికెట్లు, కుట్టు మెషిన్లు కలెక్టర్ చేతుల మీదుగా అపెరల్ పార్క్ లో అందజేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కుట్టు శిక్షణ పొందిన మహిళలు నేర్చుకున్న మెళకువలు ఉపాధి పొందడంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, టీడీఎఫ్ అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >