Posted on 2026-03-09 20:20:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో వివిధ క్రీడలు, రక్షణ, పలు రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కీర్తిస్తూ చంద్రంపేటకు చెందిన వెల్ది రేఖ మూడు నెలల పాటు శ్రమించి రూపొందించిన నారీశక్తి చీరను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆద్వర్యంలో వనిత చేయూత.. మహిళా సాధికారత కింద ముస్తాబాద్ మండలానికి చెందిన మహిళలకు కుట్టు శిక్షణ అందించి.. వారికి సర్టిఫికెట్లు, కుట్టు మెషిన్లు కలెక్టర్ చేతుల మీదుగా అపెరల్ పార్క్ లో అందజేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కుట్టు శిక్షణ పొందిన మహిళలు నేర్చుకున్న మెళకువలు ఉపాధి పొందడంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, టీడీఎఫ్ అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >