Posted on 2024-09-01 20:10:57
ఆర్డీవో కార్యాలయంలో కూర్చొని పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారి జయచంద్ర రెడ్డి
డైలీ భారత్, మెదక్ /తూప్రాన్:మెదక్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి కోరుతున్నాం భారీ వర్షాల కారణంగా తూప్రాన్ మండలంలోని గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, పశు నష్టం, ప్రమాదాలు జరగలేదని తూప్రాన్ ఆర్డీవో శ్రీ జయ చంద్రా రెడ్డి తెలియ జేశారు. అయితే 8 పెంకుటిల్లు లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 16 కచ్చా ఇంటి నిర్మాణాలు పాక్షికంగా కూలాయని, అవి తప్ప ఇతర ఆస్తి నష్టాలు ఇవి తమ దృష్టికి రాలేదని తెలిపారు. విస్తారమైన వర్షాల వల్ల హాల్ది వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గుండ్రెడ్డి పల్లి, కిస్తాపూర్ గ్రామాలకు వెళ్ళే రొడ్డులలో గల బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశామని, కావున ప్రజలు సహకరించగలరు అని కోరారు. రాగల 24 గంటలలో భారీ వర్షాలు ఉండటం వలన ప్రజలు ఎవరు అనవసరంగా బయటకు రావద్దని, విద్యుత్తు స్తంభాలకు, ఇనుప నిర్మాణాలకు దూరంగా ఉండాలని, సెల్ఫీల కోసం నీటి ప్రవాహాల సమీపం లోకి పోకూడదని ఆయన డివిజన్ ప్రజలను కోరారు. ఆర్డీవోకార్యాలయం లో తన ఆధ్వర్యంలో 24 గంటలు కంట్రోల్ రూం పని చేస్తుందని కూడా తెలియ జేశారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >